కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు నేడు హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే సీఈసీ సభ్యులు బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నగారా మోగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సెప్టెంబర్ లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

ఎన్ సీఈఆర్ టీ పాఠ్యపుస్తకాల నుంచి డార్విన్ సిద్ధాంతం తొలగింపు.. ? కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏమన్నారంటే ?

కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి నేతృత్వంలో అధికారుల టీం హైదరాబాద్ లో నాలుగు రోజులు మకాం వేయనుంది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీరు భేటీ అయ్యే కానున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై వారితో చర్చలు జరపనున్నారు.