బీహార్ లో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
బీహార్ : భారత సాయుధ బలగాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)కి చెందిన ఓ జవాన్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్, సుపాల్ జిల్లాలోని వీర్ పుర్ లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడింది ఎస్ఎస్ బీ 45వ బెటాలియన్ కు చెందిన జవాన్ చిమాల్ విష్ణుగా గుర్తించారు. ఆయన తెలంగాణకు చెందిన వారిగా అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Scroll to load tweet…
