సీఎం కేసీఆర్ సర్కారుపై తెలంగాణ ప్రజల అసంతృప్తి.. : అనురాగ్ ఠాకూర్
Anurag Thakur: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో, నిస్పృహతో ఉన్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
Telangana: వచ్చే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి.. మళ్లీ అధికార పీఠం దక్కించుకోవడానికి దక్షిణ భారత రాష్ట్రాలు కీలకం కానున్నాయి. ఈ నేపత్యంలోనే దక్షిణాదిపై బీజేపీ దృష్టి సారించింది. ఇక వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎలాగైన తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. సమయం దొరికినప్పుడల్లా ఆ పార్టీ నేతలందరూ కూడా ముఖ్యమత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. బుధవారం నాడు తెలంగాన ప్రభుత్వం, కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో, నిస్పృహతో ఉన్నారని అన్నారు.
వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు అక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా, నిరుత్సాహంగా ఉన్నారని తెలిపారు. దక్షిణాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి చాలా మంది మద్దతు లభిస్తోందని, చాలా మంది బీజేపీలో చేరానని తెలిపారు. రానున్న నెలల్లో మరింత మంది భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని అనురాగ్ ఠాకూర్ మీడియాతో అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిందని చెప్పారు. అయితే వాటి అమలు రాష్ట్ర విభజన చేతుల్లో ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు పేర్కొన్నారు. ప్రతి రాష్ట్ర అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో, నిస్పృహతో ఉన్నారని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గం, పార్టీ యొక్క కీలక సంస్థాగత సంస్థ, జూలై 2 మరియు 3 తేదీలలో హైదరాబాద్లో రెండు రోజుల పాటు సమావేశం కానుంది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు పాలుపంచుకోనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత జూలై 3న పరేట్ గ్రౌండ్స్ ఏర్పాటు చేయనున్న బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాలుపంచుకోనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని బహిరంగ సభ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.
అంతకుముందు అనురాగ్ ఠాకూర్.. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ హత్య ఘటనపై స్పందించారు. ఈ క్రూర హత్యను ఖండించారు. ఎన్ఐఏ విచారణకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.