Asianet News TeluguAsianet News Telugu

మద్యం మత్తులో తండ్రి వేధింపులు.. తట్టుకోలేక..

అతను ఓ రైస్ మిల్లు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా.. ఎనిమిది నెలల క్రితం రాజు భార్య అనారోగ్యంతో చనిపోయింది. దీంతో.. ఇద్దరు కూతుళ్లతో అతను జీవిస్తున్నాడు.

Teen daughters kill abusive father in Jagadgirigutta
Author
Hyderabad, First Published Aug 12, 2020, 7:58 AM IST

కన్న తండ్రి లైంగికంగా వేధించడాన్ని ఆ కూతుళ్లు తట్టుకోలేకపోయారు. తాగిన మైకంలో తండ్రి చేస్తున్న అకృత్యాలను చూసి భరించలేకపోయిన ఆ కూతుళ్లు.. కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన జగద్గిరిగుట్ట లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట లోని మగ్దూమ్ నగర్ కి చెందిన రాజు అనే వ్యక్తి కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. అతను ఓ రైస్ మిల్లు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా.. ఎనిమిది నెలల క్రితం రాజు భార్య అనారోగ్యంతో చనిపోయింది. దీంతో.. ఇద్దరు కూతుళ్లతో అతను జీవిస్తున్నాడు.

అయితే.. భార్య చనిపోవడాన్ని రాజు తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో భార్య పోయిన బాధలో మద్యానికి బానిసగా మారాడు. రోజూ పీకలదాకా మద్యం తాగి వచ్చి ఇంట్లో ఉన్న కూతుళ్లను నానా రకాలుగా వేధించేవాడు. తండ్రి పెడుతున్న బాధలను ఆ ఇద్దరు బాలికలు తట్టుకోలేకపోయారు. దీంతో.. గొంతు పిసికి హత్య చేశారు. కాగా.. బాలికల వయసు ఒకరికి 17ఏళ్లు కాగా.. మరొకరికి 16ఏళ్లు కావడం గమనార్హం. కాగా.. పెద్దమ్మాయి ఇంటర్ చదువుతుండగా.. రెండో అమ్మాయి.. స్కూల్ మధ్యలోనే ఆపేసింది. కాగా.. ఈ మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios