Asianet News TeluguAsianet News Telugu

కీచక ఉపాధ్యాయుడు.. పరీక్షలో ఫెయిల్ చేస్తానని విద్యార్థినిని బెదిరించి, పలుమార్లు అత్యాచారం, గర్భం దాల్చడంతో...

కొత్తగూడెంలోని ఓ ఆశ్రమపాఠశాలలో టీచర్ కీచకుడిగా మారాడు. విద్యార్థిని మీద అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. 

teacher molested girl student, got pregnant in badradri kottagudem
Author
First Published Sep 24, 2022, 8:32 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణమై ఘటన వెలుగు చూసింది. విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్లే.. వారి పాలిట కాలయములుగా మారుతున్నారు. పలురకాలుగా వారిని బెదిరిస్తూ, వేధిస్తూ అనాగరికంగా, అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని దమ్మపేట మండలంలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో ఒక విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అఘాయిత్యం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్వరావుపేట నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన బాలిక ఆ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది. 

ఆ బాలిక పై కన్నేసిన ఉపాధ్యాయుడు పిచ్చయ్య ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. దీనికోసం పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, తన మాట వినకపోతే చంపుతానని బాలికను బెదిరించాడు. అలా పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేశాడు. ఇటీవల విద్యార్థిని అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు వచ్చి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ వారు ఆమెకు వైద్యపరీక్షలు చేయించారు.   

14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడు అరెస్ట్

బాలికను పరీక్షించిన వైద్యులు  ఆమె గర్భం దాల్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు.. విద్యార్థినిని నిలదీయడంతో బాలికల పాఠశాలలో జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. దీంతో విద్యార్థిని తల్లి దమ్మపేట పోలీస్ స్టేషన్ లో శుక్రవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  ఉపాధ్యాయుడు పిచ్చయ్యపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు జనవరిలో ఝార్ఖండ్ లో జరిగింది. ఝార్ఖండ్ లో ఓ కీచక టీచర్ 13యేళ్ల బాలికపై అమానుషానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కీచక టీచర్ పదమూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై విషమిచ్చి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఝార్ఖండ్ లోని పలమౌ జిల్లాలోని పంకికి చెందిన ఓ బాలిక 2021, జనవరి 26న స్కూలుకు వెళ్లింది. కాగా, ఆ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న శంభు సింగ్ (35) బాలిక మీద కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఎవ్వరూ లేని తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అత్యాచారానికి తెగబడ్డాడు. 

ఈ విషయం పోలీసులకు తెలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను, ఆమె తల్లిదండ్రులను బెదిరించాడు. అయితే ఆ దుర్మార్గుడు అంతటితో ఆగలేదు. అదే రోజు రాత్రి విద్యార్థిని ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. బాలికకు బలవంతంగా విషపు గోలీలు తినిపించాడు. దీంతో బాలిక స్పృహ తప్పి పడిపోయింది. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో బాలిక కుటుంబానికి, ఉపాధ్యాయుడికి మధ్య భూతగాదాలు ఉన్నట్లుగా పోలీసులకు తెలిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios