ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతి వాదులను కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం.
దర్యాప్తు సంస్థలు మహిళలను తమ కార్యాలయంలోకి పిలిపించి విచారణ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల 24వ తేదీన ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్ పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిపి విచారించారు. అయితే ఈ విషయమై కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 23వ తేదీన కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తుంది.ఈ నెల 24న నిర్వహించిన విచారణలో మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడం చట్టవిరుద్దమని కవిత తరపు న్యాయవాది వాదించారు.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాం:కవిత పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీం
మనీలాండరింగ్ విషయమై ప్రశ్నించినట్టుగా ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇవాళ జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆరు వారాలకు విచారణను వాయిదా వేసింది.
