Asianet News TeluguAsianet News Telugu

నేనేందుకు చంపానో నాకే తెలియదు.. బిడ్డను బలిచ్చిన తల్లి కేసులో కొత్త విషయాలు..

మూఢనమ్మకాలు, మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఓ తల్లి ఆరునెలల పసిబిడ్డను గొంతు కోసి చంపిన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆరు నెలల పసి బిడ్డ బలితో మేకలపాడు తండాలో విషాదం అలుముకుంది. పిచ్చినమ్మకాలతో కన్నతల్లే గొంతుకోసి పసిపాప ప్రాణాలు తీయడంలో తండావాసులు ఇంకా షాక్ లోనే ఉన్నారు.

superstitious beliefs mother kills daughter in suryapet - bsb
Author
Hyderabad, First Published Apr 17, 2021, 9:34 AM IST

మూఢనమ్మకాలు, మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఓ తల్లి ఆరునెలల పసిబిడ్డను గొంతు కోసి చంపిన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆరు నెలల పసి బిడ్డ బలితో మేకలపాడు తండాలో విషాదం అలుముకుంది. పిచ్చినమ్మకాలతో కన్నతల్లే గొంతుకోసి పసిపాప ప్రాణాలు తీయడంలో తండావాసులు ఇంకా షాక్ లోనే ఉన్నారు.

ఈ దారుణ ఘటనకు ముందు పరిస్థితుల గురించి ఆరా తీస్తే... వారంరోజులుగా ఆ పాప తల్లి భారతి ఇంట్లో పూజలు చేస్తుంది. అది కూడా ఎవరూ లేనప్పుడు...అగర్‌బత్తీ లు ముట్టించి కొబ్బరికాయలు కొడుతోంది.. దీనిపై భర్త కృష్ణ ఇవేం పూజలు ? అని ప్రశ్నిస్తే ఏమీ లేదులే.. అంటూ దాటవేస్తూ వచ్చింది.

ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. కానీ తండ్రి చిన్న ఆదమరుపు ఆ పసిబిడ్డ ప్రాణాలు తీసింది. సూర్యాపేట జిల్లా మోతే మండలం బుక్కచెర్ల ఆవాసమైన మేకల పాడు తండాలో గురువారం భారతి తన ఆరు నెలల కూతురుని గొంతు కోసి బలి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తండా ఒక్కసారిగా ఉలిక్కిపడింది శుక్రవారం ఆ తండావాసులు ఎవరిని పలకరించినా భయాందోళనలో ఉన్నారు.

యూట్యూబ్ లో నాగపూజల వీడియో చూసి కూతురిని బలిచ్చిన తల్లి...

తండాకు చెందిన కృష్ణతో నిందితురాలు భారతికి ఇది రెండో వివాహం. ఆమెకు ఆరేళ్ల క్రితం మొదటి వివాహం జరిగింది. ఏం జరిగిందో తెలియదు, కానీ విడాకులు తీసుకున్నట్లు సమాచారం. భారతి, కృష్ణ ఇద్దరు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.

అయితే కొంతకాలంగా ఆమె మానసిక స్థితి బాగా ఉండటం లేదని.. ఆలయాలు, చర్చిలు, దర్గాలు తిప్పారు. అందరితో కలిసి ఉన్నప్పుడు సాధారణంగా ఉంటుందని, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆమె మానసిక పరిస్థితి భిన్నంగా ఉంటుందని తండావాసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఒకరిని కత్తితో బెదిరించినట్లు సమాచారం.

ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు శివుడు ఫోటోతో పాటు యూట్యూబ్ లో చూసి వారం రోజులుగా వివిధ దేవుళ్ళ ఫోటోలు అగర్బత్తీలు ముట్టించి, కొబ్బరికాయలు కొడుతుంది. చుట్టుపక్కల వారికి అగర్ బత్తీల వాసన వచ్చి  రోజూ ఏం పూజలు చేస్తున్నావని అడిగితే.. ‘మీకేం అవసరం, దేవుడికి నా ఇష్టం వచ్చినట్లు పూజలు చేసుకుంటా’ అని ఎదురు సమాధానం చెబుతుండడంతో ఉండిపోయారు వారు కూడా మిన్నకుండిపోయారు. 

ఈ విషయాన్నిభర్త కృష్ణ కూడా గమనిస్తూ వస్తున్నాడు. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో కూతురు రీతును జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. గురువారం సూర్యాపేటకు వెళ్లిన ఆయన.. అత్తమామలకు చెప్పిన వారు కొంత ఆలస్యం చేయడంతో ఘోరం జరిగిపోయింది. అంతలోనే భారతి కూతురు ని గొంతు కోసి చంపింది.

ప్రస్తుతం తండాలో భారతి అంటేనే భయపడుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు.  ఉన్నతాధికారుల ఆదేశాల నిందితురాలు భారతిని అనంతరం అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

కాగా, అభం శుభం తెలియని పసిబిడ్డ రీతును గొంతుకోసి హత్య చేసిన భారతి ని తండానుంచి వెళ్లగొట్టండి. నా మనుమరాలిని హత్య చేసింది. రేపు నా కొడుకుని, నన్ను హత్య చేయదని గ్యారెంటీ ఏమిటి? ఆమెపై మాకు అనుమానం ఉన్నా బిడ్డను చంపుతుందా? అనుకున్నాం. కానీ అన్నంత పనీ చేసింది మళ్ళీ ఏమీ తెలియనట్లు ఉంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కృష్ణ తల్లి చంద్రమ్మ రోదిస్తోంది.

నిందితురాలు భారతి ప్రస్తుతం తన  తల్లి గారి ఇంటివద్ద ఉంది. నీ బిడ్డను ఎందుకు హత్య చేశావని బంధువులుప్రశ్నించగా... ‘రీతును నేను ఎందుకు హత్య చేశానో నాకే తెలియడం లేదు’ అని తాపీగా సమాధానం చెబుతోంది. అసలు హత్య చేసింది కూడా గుర్తు లేదని బదులిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios