Asianet News TeluguAsianet News Telugu

మణుగూరు ఇంటర్ పరీక్షా కేంద్రంలో తేనేటీగల దాడి: ఇద్దరు విద్యార్ధులకు గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో  పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్ధులపై తేనేటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్ధులు గాయపడ్డారు.

Students Injured In Bee Attack  In Bhadradri Kothagudem inter Exam center
Author
Hyderabad, First Published May 19, 2022, 10:50 AM IST

కొత్తగూడెం:  Bhadradri Kothagudem జిల్లా Manuguru  ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్ధులపై గురువారం నాడు Honey bee దాడి చేశాయి.  విద్యార్ధులతో పాటు Exam Center కేంద్రం వద్ద ఉన్న పేరేంట్స్, కాలేజీ సిబ్బందిపై తేనేటీగలు దాడి చేశాయి. పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు ఆ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇవాళ Intermediate  సెకండియర్  పరీక్షలు రాసేందుకు మణుగూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గల పరీక్షా కేంద్రానికి విద్యార్ధులు చేరుకున్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లే సమయంలో కాలేజీ ఆవరణలో ఉన్న తేనేటీగలు  దాడి చేశాయి. పరీక్షా కేంద్రంలోకి వెళ్తున్న విద్యార్ధులు, పరీక్షా కేంద్రం వద్ద ఉన్న సిబ్బంది, అక్కడే ఉన్న పేరేంట్స్ పై దాడి చేశాయి. ఈ ఘటనలో Pravalika, Vishnu vardhanఅనే ఇద్దరు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ కే తేనేతుట్టె ఉంది. అయితే తేనేతుట్టెను తొలగించని కారణంగా ఇవాళ ఘటన చోటు చేసుకుందని విద్యార్ధులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios