Asianet News TeluguAsianet News Telugu

‘అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు..’ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

గత నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా మా పార్లమెంటు సభ్యులు రైతుల కోసం ఢిల్లీ లో పోరాడుతున్నారు. మంత్రులను ఢిల్లీ కి ఎవరు రమ్మన్నారు.. అని కేంద్రమంత్రి మాట్లాడటం తెలంగాణను అవమాన పరచడమే అని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. 

srinivas goud fires on central minister comments on telangana MPs
Author
Hyderabad, First Published Dec 24, 2021, 1:03 PM IST

హైదరాబాద్ : TRS LP కార్యక్రమంలో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. 

.మంత్రి V. Srinivas Gowd మాట్లాడుతూ...గత నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా మా పార్లమెంటు సభ్యులు farmers కోసం ఢిల్లీ లో పోరాడుతున్నారు. మంత్రులను ఢిల్లీ కి ఎవరు రమ్మన్నారు.. అని కేంద్రమంత్రి మాట్లాడటం telanganaను అవమాన పరచడమే అని మండిపడ్డారు. 

‘జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీ ల కోసం వెళతారు. మేము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతాం’.. అన్నారు. ‘అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు. తెలంగాణ నేతలను బీజేపీ బిచ్చగాళ్లుగా చూస్తోంది’ అని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ పడ్డ కష్టం అందరికి తెలుసని.. bjp leaders ఢిల్లీ లో రైతుల కోసం కాకుండా తమ రాజకీయాల కోసం తమ పెద్దలతో మాట్లాడుతున్నారన్నారు. 

పార్టీ ప్రయోజనాలే వారికి ముఖ్యమయ్యాయని విరుచుకుపడ్డారు. ధాన్యం సేకరణ పూర్తిగా కేంద్రం భాద్యతే దాన్నుంచి తప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టారు. మా మంత్రులను అవమాన పరిచి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. అని హెచ్చరించారు. 

ధాన్యంపై తేల్చరు, ప్రేమలేఖలు రాసేందుకు ఢిల్లీ వచ్చినట్లు ఫీలవుతున్నారు: కేంద్ర మంత్రులపై నిరంజన్‌రెడ్డి ఆగ్రహం

మా మంత్రులు హైద్రాబాద్ రావచ్చు గాక. పులి రెండు అడుగులు వెనకేసినంత మాత్రానా వెనకబడ్డట్టు కాదన్నారు. మంచి చేస్తే దేశమంతా తిరిగి కేంద్రం మంచి చేసిందని చెబుతాం. చెడు చేస్తే దానికి తగ్గట్టే వ్యవహరిస్తాం.. అన్నారు. రైతుల కోసం అన్ని పార్టీలు ఒక్కటైన సందర్భాలు అనేకం. కానీ తెలంగాణలో ప్రతిపక్షాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.

మా మంత్రులు ప్రభుత్వ ప్రతినిధులు. ప్రైవేటు గా ఢిల్లీ కి వెళ్ళలేదు. యాసంగి లో వరి వేయాలా వద్దా స్పష్టంగా కేంద్రం చెప్పాలి. కేసీఆర్ మీద కోపంతో అధికార దాహం తో బీజేపీ తెలంగాణ ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. తెలంగాణ కన్నా గొప్పగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎం చేస్తున్నారో శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

ప్రజల ఆగ్రహానికి బీజేపీ గురి కాక తప్పదని,  ఇది ఓ తెలంగాణ సమస్య కాదు. దేశ రైతులు కేసీఆర్ వెంట ఉన్నారు. కేసీఆర్ పిలుపు కోసం వారు ఎదురు చూస్తున్నారు.
పంజాబ్ కో విధానం కర్ణాటకకో విధానం తెలంగాణ కు ఓ విధానమా.. అని ప్రశ్నించారు. రైతులను తొక్కాలని చూస్తే తెలంగాణ ఆగ్రహానికి గురి కాక తప్పదన్నారు. 

ఇప్పటికైనా తెలంగాణకు క్షమాపణ చెప్పి కేంద్రం రైతులకు న్యాయం చేయాలన్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం హామీ లేఖ ఇస్తే ఢిల్లీ ఒడిపోయినట్టు కాదు. తెలంగాణ ఉద్యమంలో మోడీ సహా బీజేపీ నేతలు ఏం చెప్పారు. ఇపుడు ఏం చేస్తున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని మోడీ చెప్పి మాట తప్పారు.

రాష్ట్రం అసెంబ్లీ నుంచి ఎన్ని తీర్మానాలు పంపినా కేంద్రం తెలంగాణకు న్యాయం చేయడం లేదు. బీసీ గణన, ఎస్సీ వర్గీకరణ, మహిళ రిజర్వేషన్ల పై కేంద్రం తెలంగాణ తీర్మానాలను పక్కన బెట్టింది. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదు ఆయన్ను బద్నాం చేయాలని బీజేపీ నేతలు కుట్ర పన్నారు. వారి కుట్రలను ఛేదిస్తాం.బీజేపీ ని ఎదుర్కోవడానికి మా వ్యూహం మాకుంది. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు... ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగు పడదు....రైతులతో పెట్టుకోకుండా సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios