ఘట్కేసర్ లో టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలో చేరనున్న ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి
టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కూడా గులాబీ దళాన్ని వీడి కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు. ఆయన టీఆర్ఎస్ ను వీడనున్నట్టు శనివారం వెల్లడించారు.
మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి ఎంపీపీగా ఉన్న ఏనుగు సుదర్శన్రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాను పార్టీ ను విడిచిపెడుతున్నట్టు ఆయన వెల్లడించారు. గత కొంత కాలంగా మండల పరిషత్ లకు ఫండ్స్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆయన చెప్పారు. అయినా స్పందన లేదని తెలిపారు. ఈ విషయంలో మంత్రి మల్లారెడ్డి, ఇతర అధికారులకు ఎన్నో సార్లు వినతిపత్రాలు అందజేశానని అన్నారు. అయినా ఎలాంటి ఫలితమూ కనిపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ బిజెపి దూకుడు... ఈటల సమక్షంలో బిజెపిలో చేరిన ప్రముఖ సినీనటుడు
ఈ నేపథ్యంలోనే తాను పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. కాగా.. ఆయనను బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ కలిశారు. ఆయన ఇంట్లో సమావేశం అయి పార్టీలో చేరికపై చర్చించారు. కాగా బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున్న సభ నిర్వహించి ఆ టైంలోనే పార్టీలో చేరుతారని సమాచారం. ఆయనతో పాటు పలువురు లోకల్ లీడర్లుకు కూడా బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.
ఆ కాల్స్తో జాగ్రత్త : ‘‘సార్’’ అంటూ వలపు వల.. ఆ ట్రాప్లో పడ్డారో, ఇక అంతే సంగతులు
ఏనుగు సుదర్శన్ రెడ్డితో భేటీ అయిన సందర్భంగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో లోకల్ బాడీస్ నిర్లక్ష్యానికి గురువుతున్నాయని ఆరోపించారు. స్థానిక సంస్థల నాయకులకు ఎలాంటి గుర్తింపూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక గ్రామాల్లో సర్పంచ్ లో పలు అభివృద్ధి పనులు చేయించినా.. ఇప్పటికీ బిల్లులు మంజూరు కావడం లేదని అన్నారు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.