Asianet News TeluguAsianet News Telugu

ఆమె మోసం చేసింది... తెరపైకి రాధికా రెడ్డి పేరు, త్వరలోనే అందరికీ సెటిల్ చేస్తా: శిల్పా చౌదరి

కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను రాధికారెడ్డి అనే యువతి మోసం చేసినట్లు శిల్ప పోలీసులకు తెలిపింది. ఆమె తన నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుందని శిల్ప వెల్లడించింది. రాధికా రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తోందని పోలీసులకు తెలిపింది

shilpa Chowdary second day custody details
Author
Hyderabad, First Published Dec 4, 2021, 4:36 PM IST

కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణ సందర్భంగా ఆమె నుంచి పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నారు. ఈ క్రమంలోనే తనను రాధికారెడ్డి అనే యువతి మోసం చేసినట్లు శిల్ప పోలీసులకు తెలిపింది. ఆమె తన నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుందని శిల్ప వెల్లడించింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌తో పాటు పలు ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది శిల్ప. రాధికా రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తోందని పోలీసులకు తెలిపింది శిల్పా చౌదరి. 

తనకు ఎవరినీ మోసం చేయాలనే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేసింది. అందరికీ త్వరలోనే సెటిల్ చేస్తానని శిల్పా చౌదరి పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది. సినిమా హాలు, ఆసుపత్రులు, కొన్ని నిర్మాణ రంగాల్లో తాను పెట్టుబడులు పెట్టానని శిల్పా చౌదరి వెల్లడించింది. చాలా మంది నాకు బ్లాక్ మనీని వైట్‌గా చేయమని ఇచ్చారని ఆమె తెలిపింది. రియల్ ఎస్టేట్‌లో పెట్టిన డబ్బులు తిరిగి రాలేదని .. చాలా మంది ప్రముఖులు నాకు డబ్బులు ఇచ్చారని శిల్పా చౌదరి అంగీకరించింది. అంతకుముందు శిల్ప ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సీక్రెట్ లాకర్‌ను ఓపెన్ చేయించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 

ALso Read:shilpa chowdary Case: శిల్పా చౌదరి ఇంట్లో పోలీసుల సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

మరోవైపు shilpa chowdary.. పోలీసు విచారణలో తన డాబూ, దర్పాన్ని ప్రదర్శించారు. పలు సందర్బాల్లో కంటతడి పెట్టారని తెలిసింది. న్యాయస్థానం అనుమతితో పోలీసులు శిల్పాచౌదరిని రెండు రోజులపాటు తమ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి రోజు ఆమెను చంచల్ గూడ మహిళా జైలు నుంచి నార్సింగ్ లోని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ వోటీ) కార్యాలయానికి తరలించారు. అక్కడ దర్యాప్తు అధికారులు, నార్సింగ్ ఇన్ స్పెక్టర్, అదనపు ఇన్స్ పెక్టర్ మహిళా పోలీసుల సమక్షంలో ఆమెను విచారించారు.

తొలుత పోలీసులు మోసాల చిట్టాపై ప్రశ్నించగా.. శిల్ప విలపిస్తూ... ‘నాకేం తెలియదు’ అంటూ దాటవేసే ప్రయత్నం చేసింది. దాంతో పోలీసులు తమకు వచ్చిన ఫిర్యాదుల చిట్టాను.. ఆమె కోట్లు వసూలు చేసినట్లు evidenceను ముందు పెట్టారు. కాలే డేటా రికార్డులను.. ఎవరితో ఎప్పుడు? ఎంతసేపు మాట్లాడారనే చిట్టాను తీశారు. దీంతో ఆమె ఒక్కో విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. తనది మెదక్ జిల్లా అని, ఓ బాబు ఉన్నాడని చెప్పినట్లు తెలిసింది. బాధితుల వివరాలను పోలీసులు చెబుతూ.. ‘ఇంకా చెప్పమంటారా? మీరే చెబుతారా? అని ప్రశ్నించడంతో.. ఆమె అన్ని వివరాలు పూసగుచ్చినట్లు చెప్పారని తెలిసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios