Asianet News TeluguAsianet News Telugu

పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం...50 వాహనాలు ధ్వంసం

హైదరాబాద్ శివారులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా కురిసిన పొగమంచు కారణంగా దూరం నుంచి వచ్చే వాహనాలు కనిపించక ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా వాహనాలు ద్వంసమయ్యాయి. 

shadnagar road accident
Author
Shadnagar, First Published Jan 12, 2019, 10:11 AM IST

హైదరాబాద్ శివారులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా కురిసిన పొగమంచు కారణంగా దూరం నుంచి వచ్చే వాహనాలు కనిపించక ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా వాహనాలు ద్వంసమయ్యాయి. 

రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్-కొత్తూరు మధ్య గల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తూరు సమీపంలో తదట్టమైన పొగమంచు కారణంగా రహదారి కనరిపించకపోక పోవడం, ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చేవరకు కనిపించకపోవడంతో వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 ఆర్టీసి బస్సులు, 2 ప్రైవేట్ బస్సులు, 2 లారీలు, ఆటోలు, కార్లు ఇలా దాదాపు 50 వాహనాలు ద్వంసమైయ్యాయి. 
 
ఇలా ప్రమాదానికి గురైన వాహానాలు రోడ్డుపైనే ఆగిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ జరిగింది. దాదాపు 6 కిలోమీటర్ల మేర ట్రాపసిక్ స్తంబించిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముందుగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం  ద్వంసమైన వాహనాలను పక్కకు తీయించి ట్రాపిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.   
 

Follow Us:
Download App:
  • android
  • ios