Asianet News TeluguAsianet News Telugu

షాక్: తల్లిని నమ్మించి 7 ఏళ్ల ఆయూష్‌ను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు

బిస్కట్లు ఇస్తామని ఏడేళ్ల బాలుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాలుడిని  ఆయూష్‌గా గుర్తించారు.

seven year old boy kidnapped from secundrabad railway station
Author
Secunderabad, First Published Aug 20, 2018, 1:14 PM IST

హైదరాబాద్:  బిస్కట్లు ఇస్తామని ఏడేళ్ల బాలుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాలుడిని  ఆయూష్‌గా గుర్తించారు.

కాన్పూర్‌ వెళ్లేందుకు ఓ మహిళ తన ఏడేళ్ల కొడుకుతో  బాలుడిని  తీసుకొని  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది.  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని నెంబర్ 1 ఫ్లాట్‌ఫామ్‌‌లో ఉంది.

అయితే ఆ సమయంలో ఇద్దరు మహిళలు వచ్చి బాలుడికి బిస్కట్లు ఇప్పిస్తామని తల్లికి చెప్పి ఆ బాలుడికి తీసుకెళ్లారు. క్షణంలో ఆ బాలుడితో పాటు  ఇద్దరు మహిళలు కన్పించకుండాపోయారు.

అయితే బిస్కట్ల కోసం వెళ్లిన తన కొడుకు కూడ కన్పించకపోయేసరికి ఆ బాలుడి తండ్రి ఆందోళన చెందింది. వెంటనే పోలీసలుకు ఫిర్యాదు చేసింది.  ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీపుటేజీని పరిశీలించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  నుండి  ఇద్దరు మహిళలు ఆ బాలుడిని తీసుకొని వెళ్లినట్టు గుర్తించారు. ఆ ఇద్దరు మహిళలు ఎవరనే విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు. తనకు ఎవరిపై కూడ అనుమానం లేదని  బాలుడి తల్లి చెబుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios