కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు, శివల పాత్రపై పోలీసులు ప్రస్తావించారు.
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు, శివలను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సుబ్బారావు, శివల పాత్రపై పోలీసులు ప్రస్తావించారు. సుబ్బారావు, శివలు విధ్వంసం చోటుచేసుకున్న జూన్ 17కు ఒక్కరోజు ముందుగానే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చారని, హకీంపేట సోల్జర్స్ వాట్సప్ గ్రూప్లో ఆర్మీ అభ్యర్థులతో వీరిద్దరూ వేర్వేరుగా తీసుకున్న ఫొటోలున్నాయని నివేదించారు.
హకీంపేట్ సోల్జర్స్ గ్రూప్లో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్టులు పెట్టారని.. ఆందోళనకు కావల్సిన లాజిస్టిక్స్ సమకూర్చినట్టు పోలీసులు నిర్ధారించారు. కీలక నిందితులతో సుబ్బారావు ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృథ్వీరాజు సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్ధి అని, విద్వంసంలో కీలకంగా వ్యవహరించిన పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్గా నిర్ధారించారు.
ఇక, ఈ కేసులో ఇప్పటివరకు 63మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 55మందిని అరెస్ట్ చేసి.. రిమాండ్కు తరలించారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసానికి సంబంధించి సేకరించిన ప్రాథమిక ఆధారాలు, అరెస్టయిన నిందితుల నుంచి రికార్డు చేసిన వాంగ్మూలాలను బుధవారం కోర్టుకు సమర్పించారు.
ఇకపోతే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసంకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్లు, రైల్వే ఆస్తుల ధ్వంసం, రైళ్లకు నిప్పుపెట్టడం.. వెనక కొందరు కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఒకరిద్దరు తొలుత రైల్వే బోగీల్లోకి వెళ్లి నిప్పు పెట్టినట్టుగా కనిపిస్తున్న కొన్ని వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ ఈ దృశ్యాలను ప్రసారం చేశాయి. ఆ వీడియోల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందినకు పృథ్వీరాజ్ కూడా ఉన్నాడు.. రైలు బోగీలోకి వెళ్లి పేపర్లకు నిప్పు పెట్టి సీట్లకు నిప్పటించాడు. ఆ దృశ్యాలను వీడియోలు కూడా తీయించుకున్నాడు. ఒకరిద్దరు ఇలాంటి చర్యలు దిగిన తర్వాత మరికొందరు రైల్వే ఆస్తుల ధ్వంసం చేయడానికి, రైల్వే బోగీలకు నిప్పుపెట్టినట్టుగా తెలుస్తోంది.
