కేంద్ర సెన్సార్ బోర్డు కార్యాలయంపై దాడి
పీడిత కులాల సమస్యలు, అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణిని కథాంశంగా ఎన్నుకొని తెలంగాణ దర్శకుడు తీసిన చిత్రం శరణం గచ్ఛామి. అయితే కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి అనుమతివ్వడంలేదు. ఎన్నిసార్లు వేడుకున్న సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.
దీంతో ఆగ్రహం చెందిన చిత్ర యూనిట్ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు ఈ రోజు కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు కార్యాలయంపై దాడికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాగా, ఈ చిత్రం విడుదలైతే సమాజంలో శాంతి, భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే అందుకనే సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు పలు సన్నివేశాలను తొలగించాలని సీబీఎఫ్సీ సూచించగా అందుకు దర్శకుడు ప్రేమ్ రాజ్ నిరాకరించారని అందుకే ఈ చిత్రానికి సెన్సార్ నుంచి అనుమతి రావడం లేదని వార్తలు వస్తున్నాయి.
