స్వేద పత్రం విడుదలను ఆదివారానికి వాయిదా వేశారు. రేపు ఉదయం 11గంటలకు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో గత పదేళ్ల బీఆర్ఎష్ ప్రభుత్వానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ నిన్న ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ స్వేద పత్రాన్ని శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ముందు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇది వాయిదా పడింది. స్వేద పత్రం విడుదలను ఆదివారానికి వాయిదా వేశారు. రేపు ఉదయం 11గంటలకు విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.
Add Asianetnews Telugu as a Preferred Source

