బాలికపై మరో యువకుడితో కలిసి బాబాయ్ అత్యాచారం, ఆపై హత్య
మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న బాలికను ఆమె బాబాయి అత్యాచారం చేసి చంపేశాడు.
మహబూబ్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న బాలికను ఆమె బాబాయి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ ఘటన బాలానగర్ మండలం తిరుమలగిరిలో చోటుచేసుకుంది. బాలికపై మరో యువకుడితో కలిసి ఆమె బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇద్దరు కలిసి బాలికను హత్య చేశారు. తర్వాత బాలిక ఉరివేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలుతెలియాల్సి ఉంది.