Asianet News TeluguAsianet News Telugu

రంగారెడ్డి జిల్లాలో రియల్ ఏస్టేట్ వ్యాపారి సత్తయ్య హత్య

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ అటవీ ప్రాంతంలో రియల్ ఏస్టేట్ వ్యాపారి సత్తయ్య హత్యకు గురయ్యారు.ఓ భూమి విషయంలో రియల్ఏస్టేట్ వ్యాపారుల మధ్య విభేదాల కారణంగా  ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Real estate agent sathaiah killed in Ranga Reddy district
Author
Hyderabad, First Published Jun 19, 2020, 1:27 PM IST


హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్‌గల్ అటవీ ప్రాంతంలో రియల్ ఏస్టేట్ వ్యాపారి సత్తయ్య హత్యకు గురయ్యారు.ఓ భూమి విషయంలో రియల్ఏస్టేట్ వ్యాపారుల మధ్య విభేదాల కారణంగా  ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

చౌదరిపల్లికి చెందిన సత్తయ్యగా పోలీసులు గుర్తించారు. భూమి రిజిస్ట్రేషన్ విషయంలో తమ వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చినట్టుగా గుర్తించారు.
ఈ విషయమై ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

గున్‌గల్ అటవీ ప్రాంతంలో సత్తయ్య మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. భాగస్వామ్యుల మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. 

ఏ భూమి విషయంలో భాగస్వామ్యుల మధ్య గొడవలు  చోటు చేసుకొన్నాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూములకు చాలా విలువ ఉంది. ఎయిర్ పోర్టుతో పాటు పలు ఐటీ కంపెనీలు , ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios