నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఓ కంపెనీలో రియాక్టర్ పేలుడు చోటుచేసుకుంది. రియాక్టర్ పేలుడుతో విషవాయువులు వెలువడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు విషవాయువులు వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ఓ కంపెనీలో రియాక్టర్ పేలుడు చోటుచేసుకుంది. రియాక్టర్ పేలుడుతో విషవాయువులు వెలువడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు విషవాయువులు వ్యాపించడంతో.. దుర్వాసనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలి కంపెనీ నుంచి విషవాయువులు వెలువడటంతోనే వెలిమినేడు, పేరేపల్లి, బొంగోనిచెర్వు, పిట్టంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
