Asianet News TeluguAsianet News Telugu

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూజెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మరణించగా, కంటైనర్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో మరో ముగ్గురు మరణించారు.

Raod accident in Nalgonda district: Six dead
Author
Nalgonda, First Published Sep 19, 2021, 12:10 PM IST

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

కంటైనర్ ను కారు ఢీకొట్టి ఆ తర్వాత చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. హైదరాబాదు నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

మరో ఘటనలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో మరో ముగ్గురు మరణించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios