ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపకూడదని చేపట్టిన ఆందోళన సోమవారం నాడు హింసాత్మకంగా మారింది
మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్కొండ మండలాన్ని నారాయణపేట జిల్లాలో కలపకూడదని చేపట్టిన ఆందోళన సోమవారం నాడు హింసాత్మకంగా మారింది. ఆందోళనకారుల రాళ్ల దాడిలో సీఐ పాండురంగారెడ్డి తలకు గాయాలయ్యాయి.
Add Asianetnews Telugu as a Preferred Source

కోయిల్కొండ మండలాన్ని మహబూబ్నగర్ జిల్లాలోనే కొనసాగించాలని ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మహబూబ్నగర్- కోయిల్కొండ మార్గంలోని దమ్మాయిపల్లి గేటు వద్ద వంటా వార్పు నిర్వహించారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది.
ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో సీఐ పాండురంగారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అదనపు బలగాలను తరలించారు.
వీడియో
"
