Asianet News TeluguAsianet News Telugu

ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. ప్రేమ పేరుతో త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు.. : క‌న్హ‌య్య కుమార్

Hyderabad: హైద‌రాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయ‌కుడు కన్హయ్య కుమార్ అన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల, యువకుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారి (ప్రవళిక) ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్  చేసిన ఆయ‌న‌.. ప్రేమ వ్య‌వ‌హారమంటూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు.
 

pravalikas suicide: Congress leader Kanhaiya Kumar urges youth to hold govt accountable on student's suicide RMA
Author
First Published Oct 17, 2023, 4:04 PM IST

Congress leader Kanhaiya Kumar: హైద‌రాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయ‌కుడు కన్హయ్య కుమార్ అన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల, యువకుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారి (ప్రవళిక) ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్  చేసిన ఆయ‌న‌.. ప్రేమ వ్య‌వ‌హారమంటూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ విద్యార్థులు, యువతను ఉద్దేశించి అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) నేత కన్హయ్య కుమార్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల, యువకుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనను కన్హయ్య ఎత్తిచూపారు. ప్రభుత్వ ప్రతిస్పందనను ఆయన విమర్శించారు. విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ను ప్రేమ వ్యవహారంతో ముడిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలను పదే పదే వాయిదా వేయడం వల్ల విద్యార్థినుల ఆందోళనను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందనీ, ఇది తనను నిరాశకు గురి చేసిందని కన్హయ్య కుమార్ అన్నారు. ప్రవళిక ఆత్మహత్య ఘటనలో ప్రేమ‌ వ్యవహారం లేద‌నీ, పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ కావడం, జరుగుతున్న జాప్యాల వల్లే విద్యార్థిని విషాదకరమైన ముగింపున‌కు కార‌ణ‌మ‌ని కన్హయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థుల భవిష్యత్తుతో పాలక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు.

పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేయాలని కన్హయ్య పిలుపునిచ్చారు. ప్రశ్నపత్రాల లీకేజీలను నిరోధించేందుకు కొత్త చట్టాల ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వదిలేశార‌నీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారని కన్హయ్య ఉద్ఘాటించారు.

ప్రభుత్వ విధానాలను సవాలు చేసేందుకు యువత శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమించాలనీ, నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు నెలవారీ భృతిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కన్హయ్య కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios