Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు..

హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ మన్సూరాబాద్ కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. సోషల్ మీడియాలో పోలీసులపై దాడులు చేయాలని పోస్టులు పెట్టాడనే ఆరోపణలపై ఎల్‌బీ నగర్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

Police Register case against Mansoorabad Corporator Koppula Narsimha Reddy
Author
First Published Sep 14, 2022, 5:11 PM IST

హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ మన్సూరాబాద్ కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డిపై పోలీసులు కేసు నమోదైంది. బీజేపీకి చెందిన నర్సింహారెడ్డి.. సోషల్ మీడియాలో పోలీసులపై దాడులు చేయాలని పోస్టులు పెట్టాడనే ఆరోపణలపై ఎల్‌బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో బెంగాల్‌లో విధ్వంసం వీడియోలకు  నర్సింహారెడ్డి రిప్లై‌లు పెట్టినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే విధ్వంసాలను ప్రేరేపించారని అభియోగాలపై ఐపీసీ సెక్షన్‌లు 163ఏ, 502, 505(2), 506, 153, 189 కింద కేసులు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios