తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు పోలీసులు నేడు నోటీసులు ఇవ్వనున్నారు. 


తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు పోలీసులు నేడు నోటీసులు ఇవ్వనున్నారు. జితేందర్ రెడ్డి డ్రైవర్‌ను, పీఏను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. మంత్రి హత్య చేయాలనే కుట్ర చేసిన నిందితులకు జితేందర్ రెడ్డి పీఏ, డ్రైవర్ ఆశ్రయమిచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను పోలీసులు భగ్నం చేయడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా దుమారం రేగింది. ఇందుకు రూ. 15 కోట్ల డీల్ జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఇందకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెస్ రవీంద్ర బుధవారం మీడియాకు వెల్లడించారు. హత్యకు పన్నిన కుట్రను ఆదిలోనే భగ్నం చేశామని తెలిపారు. ఈ కేసులో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణల ప్రమేయం ఆరా తీస్తున్నట్టుగా వెల్లడించారు. 

‘ఫారూఖ్, హైదర్ అలీ ఫిబ్రవరి 23న మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ కు వచ్చారు. పేట్‌బషీరాబాద్‌ పరిధిలో సుచిత్ర వద్ద ఓ లాడ్జిలో వారు దిగారు. 25న మధ్యాహ్నం రెండింటికి ఆ ఇద్దరు సుచిత్ర సెంటర్‌కు వచ్చారు. అదే సమయంలో మహబూబ్‌నగర్‌‌ జిల్లాకు చెందిన నాగరాజు, బండేకర్ విశ్వనాథ్ రావు, వర్ణ యాదయ్యలు కత్తులు, ఇతర మారణాయుధాలతో ఫరూక్‌, హైదరాలీని చంపడానికి వెంటపడ్డారు. గమనించిన ఇద్దరు వారి నుంచి తప్పించుకొని పరారయ్యారు. అదేరోజు సాయంత్రం 5గంటలకు ఆ ఇద్దరూ ఘటనపై పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మరుసటి రోజే నాగరాజు సహా ఇతర నిందితులను అదుపులోకి తీసుకున్నారు’ అసి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 

‘గత నెల 26న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని.. వీరిని విచారించగా యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ పేర్లు బయటకొచ్చాయి. రాఘవేందర్ రాజు సహా మరికొందరు హత్యకు కుట్ర చేశారని నాగరాజు చెప్పాడు.నాగరాజు అరెస్టు విషయం తెలియగానే రాఘవేంద్రరాజు సహా ముగ్గురు నిందితులు మహబూబ్‌నగర్‌‌ నుంచి వైజాగ్‌, అక్కడి నుంచి ఢిల్లీకి పారిపోయారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సేకరించిన పోలీసులు నిందితులు డిల్లీలోనే ఉన్నట్లు గుర్తించారు. నిందితులకు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డ్రైవర్‌ తాప, ఆయన పీఏ రాజు ఆశ్రయం ఇచ్చినట్టుగా కనుగొన్నారు. 

దీంతో పోలీసుల బృందం డిల్లీకి వెళ్లి వారిని గుర్తించి అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వారి వద్ద నుంచి రెండు పిస్టళ్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్రరాజు, మున్నార్‌ రవి, మధుసూదన్‌ రాజు, అమరేందర్‌రాజును పోలీసులు విచారించగా వారంతా కలిసి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్రపన్నినట్లు వెల్లడించారు. ఈ కేసులో మాజీ ఎంపీ జితేందర్‌‌రెడ్డి పాత్రపై కూడా విచారణ జరుపుతామన్నారు. మధుసూదన్ రాజు, అమరేందర్‌‌ ఇస్తామని చెప్పిన సుపారీ డబ్బు రూ.15 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నాం. మంత్రిని ఎక్కడ, ఎలా కుట్ర చేయాలని చూశారనే వివరాలను విచారణలో రాబడతాం’ అని మీషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.