Asianet News TeluguAsianet News Telugu

ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసుల లాఠీచార్జ్

ఆదిలాబాద్‌ జిల్లాలో (adilabad district) తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలో గిరిజిన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన తెలియజేశారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత తెలియజేశారు.

police lathi charge on student unions in adilabad district
Author
Adilabad, First Published Jan 3, 2022, 12:45 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో (adilabad district) తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లాలో గిరిజిన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన తెలియజేశారు. ఇందుకు సంబంధించి.. అధికారులు, ప్రజా ప్రతినిధులను ఎన్నిసార్లు కోరిన ఫలితం లేదని విద్యార్థి సంఘాలు (students union) ఆరోపించారు. ఈ క్రమంలోనే కలెక్టర్ వాహనాన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి నాయకులపై లాఠీచార్జ్ (lathi charge) చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో విద్యార్థి సంఘం నాయకులు రోడ్లపై పరుగులు తీశారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios