మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో హత్యకు గురైన వ్యక్తిని ధర్మకారి శ్రీనివాస్‌గా గుర్తించారు. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనతో తరచూ గొడవ పడేవాడని హైందవి పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో హత్యకు గురైన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు గుర్తించారు. కారు ఇంజిన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెదక్‌ పట్టణంలోని ఓ సినిమా టాకీస్‌ యజమాని వాహనంగా దాన్ని గుర్తించారు. మృతుడిని మెదక్‌కు చెందిన ధర్మకారి శ్రీనివాస్‌గా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో. మృతుడి నోటిలో ఉన్న కృత్రిమ దంతాల ఆధారంగా శ్రీనివాస్‌ను ఆయన భార్య హైందవి గుర్తించారు. అనంతరం భర్త హత్యపై ఆమె వెల్దుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనతో తరచూ గొడవ పడేవాడని హైందవి పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ALso Read:మెదక్ జిల్లాలో దగ్దమైన కారు: డిక్కీలో డెడ్‌బాడీ