హైదరాబాద్ లాలాగూడ పోలీసు స్టేషన్లో ఎంఐఎం ఎమ్మెల్సీ దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలోనే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ లాలాగూడ పోలీసు స్టేషన్లో ఎంఐఎం ఎమ్మెల్సీ దౌర్జన్యానికి దిగారు. అక్రమంగా జంతువులను తరలిస్తున్న ఎంఐఎం కార్యకర్తలు ఈ క్రమంలో ఎంఐఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 30 మంది ఎంఐఎం కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ లాలాగూడ పోలీసు స్టేషన్కు చేరుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారు. పీఎస్లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్టేషన్పై దాడి చేసి ఎంఐఎం కార్యకర్తలను తీసుకెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే పోలీసు కార్యాలయంపై దాడికి యత్నించారని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎన్టీవీ న్యూస్ చానల్ రిపోర్టు చేసింది.
