Asianet News TeluguAsianet News Telugu

ఇంటికి తీసుకువెళ్తానని బైక్ ఎక్కించుకొని.. మహిళ పై అఘాయిత్యం..!

 ఈ నెల 14న విధులకు వెళ్లిన పోచమ్మ తిరిగి రాలేదు. 15 ఉదయం నుచ్చుగుట్టతండా సమీపంలో శవమై కనిపించింది.

Police arrest the man Who Murdered woman in Rangareddy
Author
Hyderabad, First Published Sep 17, 2021, 8:35 AM IST

పరిచయం ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్తానని నమ్మించి బైక్ ఎక్కించుకొని వెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా నుచ్చుగుట్ట తండా శివారులో ఓ పారిశుధ్య కార్మికురాలు కొమ్ము పోచమ్మ(39) హత్యకు గురవ్వగా.. ఆమె మర్డర్ కేసును పోలీసులు చేధించారు. హత్య కేసును చేదించి నిందితుడు జైపాల్‌నాయక్‌ను అరెస్టు చేశామని గురువారం ఆయన ఆమనగల్లులో తెలిపారు. 

వివరాలిలా ఉన్నాయి... ముర్తోజుపల్లికి చెందిన కొమ్ము పోచమ్మ హైదరాబాద్‌లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసేది. మాడ్గుల మండలం చంద్రాయన్‌పల్లిలో ఉంటూ రోజూ విధులకు వెళ్లి వస్తుండేది. ఈ నెల 14న విధులకు వెళ్లిన పోచమ్మ తిరిగి రాలేదు. 15 ఉదయం నుచ్చుగుట్టతండా సమీపంలో శవమై కనిపించింది.

 భర్త గాలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయగా సాకిబండ తండాకు చెందిన జైపాల్‌నాయక్‌ ఈ హత్య చేసినట్టు తెలిసిందని ఏసీపీ తెలిపారు. గతంలో పోచమ్మతో పరిచయం ఉండటంతో తన బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడన్నారు. తరచూ ఫోన్‌ చేసి డబ్బు కోసం వేధించడంతో చంపేశానని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. జైపాల్‌నాయక్‌ను గురువారం తండాలో అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios