కాళేశ్వరం ప్రాజెక్టు: తెలంగాణ సర్కార్కు షాక్.. మూడో టీఎంసీ పనులపై హైకోర్టులో పిల్
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఈ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఈ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్కు చెందిన శ్రీనివాసరెడ్డి ఈ పిల్ దాఖలు చేశారు. మూడో టీఎంసీకి అనుమతులు లేకుండానే పనులు చేపట్టారని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు.కేంద్రం, ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పనులు నిర్వహిస్తోందని ఆరోపించారు. ఈ పిల్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పనులు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది.