సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు .. 6 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ దందాను పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా రూ.6 లక్షలు విలువ చేసే డ్రగ్స్తో పాటు ఓ కారు, ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ కేంద్రంగా ఈ ముఠా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. శనివారం పక్కా సమాచారంతో దాడి చేసి నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిని మదన్, గురువారెడ్డి, మనోహర్లుగా తెలిపారు. నిందితులపై సిద్ధిపేట జిల్లాలోనూ డ్రగ్స్ కేసులు వున్నట్లు పోలీసులు వెల్లడించారు. రూ.6 లక్షలు విలువ చేసే డ్రగ్స్తో పాటు ఓ కారు, ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. పరారీలో వున్న మరొకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇకపోతే.. ఇటీవల హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతున్న డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన సుదీప్, బిశ్వాస్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. పర్ఫెక్ట్ డెంటల్ క్లినిక్ పేరుతో డాక్టర్ వైద్యం చేస్తున్నాడు. కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సుదీప్ దగ్గర నుంచి ఎండీఎంఏ, కెటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు