పవన్ కల్యాణ్ పై ఒత్తిడి: తెలంగాణలో 40 సీట్లపై గురి
ఇప్పటికే తెలంగాణ నేతలు, కార్యకర్తలు పవన్ కల్యాణ్ ను కలిశారు తెలంగాణలో పోటీ చేయాలని వారు ఆయనను కోరారు. త్వరలో క్లారిటీ ఇస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ ఒత్తిడి తగ్గడం లేదు.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పార్టీని పోటీకి దించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోంది. జనసేన తెలంగాణ నాయకులు పవన్ కల్యాణ్ పై ఆ ఒత్తిడి పెడుతున్నారు. తెలంగాణలో పోటీ చేసే విషయంపై ఆయన మాత్రం ఇప్పటి వరకు ఏ విషయమూ చెప్పలేదు.
తెలంగాణలో కనీసం 40 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాలని తెలంగాణ నాయకులు తమ నేత పవన్ కల్యాణ్ ను కోరుతున్నారు. తెలంగాణలో పోటీ చేసే విషయంపై పవన్ కల్యాణ్ ఈ నెల 16వ తేదీన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే తెలంగాణ నేతలు, కార్యకర్తలు పవన్ కల్యాణ్ ను కలిశారు తెలంగాణలో పోటీ చేయాలని వారు ఆయనను కోరారు. త్వరలో క్లారిటీ ఇస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ ఒత్తిడి తగ్గడం లేదు.