Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్: గూగుల్ సిగ్నల్ వద్ద బైక్‌పై దూసుకెళ్లిన కారు ... యువతి మృతి

హైదరాబాద్ మాదాపూర్‌‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. సిగ్నల్‌ వద్ద ఆగివున్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువతి మృతి చెందగా, యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

one killed in road accident in hyderabad
Author
Hyderabad, First Published Oct 4, 2021, 12:57 AM IST

హైదరాబాద్ మాదాపూర్‌‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. సిగ్నల్‌ వద్ద ఆగివున్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువతి మృతి చెందగా, యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అజయ్‌, జెన్నిఫర్‌‌లు బైక్‌పై కొత్తగూడ నుంచి సైబర్‌ టవర్‌ వైపు వెళ్తున్నారు.

ఈ క్రమంలో సీఐఐ జంక్షన్‌ వద్దకు రాగానే ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడటంతో ఆగారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న జెన్నిఫర్‌ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్‌ ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్న మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios