Huzurabad By Poll: హుజురాబాద్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్ధిగా బల్మూరి వెంకట్
హుజురాబాద్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను అభ్యర్ధిగా ప్రకటించింది టీపీసీసీ.
హుజురాబాద్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను అభ్యర్ధిగా ప్రకటించింది టీపీసీసీ.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్ధిత్వం వైపు కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపింది. అయితే ఈ స్థానం నుండి పోటీకి ఆమె విముఖతను చూపింది. ఈ విషయాన్ని గురువారం నాడు సాయంత్రం కొండా సురేఖ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పింది.
అయితే కొత్త అభ్యర్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్వేషణను మొదలు పెట్టింది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పత్తి కృష్ణారెడ్డి, వ్యాపారవేత్త రవికమార్,ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ పేరును కూడ కాంగ్రెస్ నాయకత్వం పరిశీలించింది.