తెలుగు రాష్ట్రాల్లో విరసం నేతల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు
ఏపీ, తెలంగాణల్లోని విరసం, పౌర హక్కుల నేతల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో విరసం నేత వరలక్ష్మీ ఇంట్లో తనిఖీలు నిర్వహించింది.
ఏపీ, తెలంగాణల్లోని విరసం, పౌర హక్కుల నేతల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాడులు నిర్వహించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో విరసం నేత వరలక్ష్మీ ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. అలాగే హైదరాబాద్లోని పౌరహక్కుల నేత, న్యాయవాది రఘునాథ్ నివాసంలోనూ సోదాలు నిర్వహించింది.
మరోవైపు కర్నూలు నగరంలోని విరసం నేత పినాకపాణి ఇంట్లోనూ ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. గతంలో ఏపీసీఎల్సీలో ఆయన పనిచేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.