హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. ప్రగతి నగర్లో నవ వధువు హత్యకు గురైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కిరణ్ జీవిత భాగస్వామిని గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఆత్మహత్యకు యత్నించాడు.
హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. ప్రగతి నగర్లో నవ వధువు హత్యకు గురైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త కిరణ్ జీవిత భాగస్వామిని గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఆత్మహత్యకు యత్నించాడు. అయితే దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కిరణ్- సుధారాణికి రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. ఇంతలోనే ఈ దారుణం జరగడం కుటుంబసభ్యుల్లో విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

