తెలంగాణ : కొత్తగా 165 కరోనా కేసులు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండో డోస్ మొదలైపోయింది. అయితే ఈ క్రమంలో తెలంగాణలో రోజు రోజుకూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండో డోస్ మొదలైపోయింది. అయితే ఈ క్రమంలో తెలంగాణలో రోజు రోజుకూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 165 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,97,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,623కి చేరింది.
అలాగే కరోనా నుంచి 2,93,940మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 1,7515 యాక్టివ్ కేసులు ఉన్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 35 కేసులు నమోదయ్యాయి.