Asianet News TeluguAsianet News Telugu

గచ్చిబౌలిలో నేపాల్ గ్యాంగ్... యజమానికి నమ్మించి భారీ చోరీ, 120 తులాల బంగారం, 15 లక్షల నగదుతో పరారీ...

రెండు రోజుల్లో వస్తామని చెప్పి వాచ్ మెన్ దంపతులు లక్ష్మణ్ (34), పవిత్ర (30)లకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఫోన్ చేయగా లక్ష్మణ్ స్పందించలేదు.  దీంతో ఇంట్లో అద్దెకు ఉండేవారితో పాటు స్నేహితులను పురమాయించారు.  వాళ్లు సర్వెంట్ రూమ్ కి వెళ్లి చూడగా.. తలుపులు తెరిచి ఉన్నాయని, ఎవరూ లేరని తెలిపారు.
 

nepali watchman couple robber owners house in gachibowli, hyderabad
Author
Hyderabad, First Published Sep 21, 2021, 11:57 AM IST

హైదరాబాద్ : గచ్చిబౌలిలో నేపాల్ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. వాచ్ మెన్,  హౌస్ కీపింగ్ పనులు చేసే నేపాల్ కు చెందిన దంపతులు యజమాని ఇంట్లో 120  తులాల బంగారు ఆభరణాలు,  పదిహేను లక్షల రూపాయల నగదు చోరీ చేసి ఉడాయించారు.  రాయదుర్గం సీఐ రాజ్‌ గోపాల్ రెడ్డి, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  
స్థానిక టెలికాంనగర్ కు చెందిన వ్యాపారి బీరం గోవిందరావు శనివారం ఉదయం స్నేహితుడు గంగాధర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. 

రెండు రోజుల్లో వస్తామని చెప్పి వాచ్ మెన్ దంపతులు లక్ష్మణ్ (34), పవిత్ర (30)లకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఫోన్ చేయగా లక్ష్మణ్ స్పందించలేదు.  దీంతో ఇంట్లో అద్దెకు ఉండేవారితో పాటు స్నేహితులను పురమాయించారు.  వాళ్లు సర్వెంట్ రూమ్ కి వెళ్లి చూడగా.. తలుపులు తెరిచి ఉన్నాయని, ఎవరూ లేరని తెలిపారు.

దీంతో గోవిందరావు,  దీపా దంపతులు హుటాహుటిన ఆదివారం రాత్రి 7 గంటలకు  టెలికాం నగర్ చేరుకున్నారు.  తాళం తీసి ఇంట్లోకి వెళ్లి చూడగా కిటికీ గ్రిల్స్ తొలగించి ఉంది.  లోపల గది తాళం పగులగొట్టి,  బీరువా తెరిచి,  వస్తువులు కింద పడేసి ఉన్నాయి. లాకర్ లో ఉన్న బంగారు ఆభరణాలు నగదు చోరీకి గురైందని గుర్తించి రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు ఆ దంపతులు.

సర్వెంట్ రూమ్ లో ఉండే లక్ష్మణ్ శనివారం రాత్రి రెండుగంటల సమయంలో మెట్ల పైకి ఎక్కినట్లుగా సీసీ ఫుటేజ్ లో రికార్డు అయింది.  ఆ తర్వాత విద్యుత్ లైట్లు, వీధిలైట్లు ఆపేశారు.  ఈ సమయంలోనే  చోరీ చేసి పరారయ్యారని సీఐ తెలిపారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

భారీ చోరీకి పాల్పడిన నిందితుల కోసం నాలుగు బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులు పటాన్చెరు మీదుగా మహారాష్ట్రకు పరారైనట్లు పోలీసులు గుర్తించారు.  అద్దె వాహనంలో  వెళ్ళినట్లు  పోలీసులు పేర్కొంటున్నారు. చోరీలో లక్ష్మణ్, పవిత్ర దంపతులు మాత్రమే ఉన్నారా? లేక మరికొంత మంది సహాయం తీసుకుని ఉంటారా? అనేది తేలాలి.

బావ వరుసవుతానంటూ ప్రేమ పాఠాలు, పెళ్లి... చివరికి అన్నవరుస అనే నిజం తెలియడంతో...

గత అక్టోబర్ 6న బిఎన్ఆర్ హిల్స్లో  నేపాల్కు చెందిన గ్యాంగ్ ఇదే తరహాలో దోపిడీకి పాల్పడింది.  బోర్వెల్ యజమాని మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి 15 లక్షల రూపాయల నగదు, ఆభరణాలు చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే.

ఇక గోవిందరావు ఇంట్లో మొదట్లో నేపాల్కు చెందిన ఏం. లాల్ అనే వ్యక్తి వాచ్మెన్ గా పని చేసేవాడు.  నాలుగు నెలల క్రితం తను ఊరికి వెళ్ళిపోతున్నాను అని.. చెప్పి తన బంధువులే అంటూ నమ్మించి లక్ష్మణ్ పనిలో చేర్చాడు.  వాచ్మెన్ గా ఇంట్లో హౌస్ కీపింగ్ పనులు చేస్తూ నమ్మకం గా ఉంటున్నారు ఈ దంపతులు.  ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో కనిపెట్టి రెండు రోజులపాటు యజమానులు ఉండరని తెలుసుకుని చోరీకి పాల్పడ్డారు.

 నాలుగు నెలలుగా నమ్మకంగా ఉండి ముంచేశారని ఈ సందర్భంగా బాధితుడు గోవిందరావు మీడియాతో పేర్కొన్నారు. ఎలాంటి అనుమానం రాకుండా మంచిగా ప్రవర్తించారని చెప్పారు.  బీరువా లోనే లాకర్ తాళంచెవి ఉండడంతో గది తాళం పగులగొట్టి లాకర్ ను ఓపెన్ చేశారని,  దాదాపు 120 తులాల బంగారు ఆభరణాలు 15 లక్షల నగదు దోచుకు వెళ్లారని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios