తెలంగాణ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పనులకు బ్రేక్ వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ). పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. 

తెలంగాణ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పనులకు బ్రేక్ వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ). పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ పనులు చేపట్టొద్దని ఎన్జీటీ సూచించింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌పై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ జరిపిన ఎన్‌జీటీ ఈమేరకు తీర్పు వెలువరించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇకపోతే పాలమూరు రంగారెడ్డి లిప్ట్ ప్రాజెక్టుపై ఏపీకి చెందిన రైతులు జూలై 15న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై పనుల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేసింది ఎన్జీటీ. పాత అనుమతులతోనే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ను నిర్మిస్తోందని ఆ పిటిషన్ లో రైతులు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకొనే వరకు తాగు నీటి అవసరాల కోసమే పరిమితం చేయాలని రైతులు కోరారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చే వరకు తాగు నీటి అవసరాల కోసమే పరిమితం చేయాలని రైతులు కోరారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పనుల పరిశీలన కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. 

ALso Read:palamuru Rangareddy lift irrigation:పర్యావరణ, ఫారెస్ట్ శాఖలపై ఎన్జీటీ ఆగ్రహం

దీనితో పాటు ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులకు సంబంధించి సెప్టెంబర్ 27న జరిగిన విచారణ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై (palamuru Rangareddy lift irrigation) పర్యావరణ, అటవీశాఖల వ్యవహరశైలిపై ఎన్జీటీ (national green tribunal) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగితే రెగ్యులేటరీ బాడీ ఎందుకు స్పందించలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది.చర్యలకు ఆదేశించే వరకు అధికారుల్లో కదలిక ఎందుకు రాలేదని ఎన్జీటీ ప్రశ్నించింది. ఈ ప్రాజెక్టుపై ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డును (krmb) ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.అటవీ, పర్యావరణ శాఖలకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది ఎన్జీటీ.

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కృష్ణా నది (krishna river) జలాలను తెలంగాణ అక్రమంగా వాడుకొనేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని ఏపీ సర్కార్ వాదిస్తోంది. అయితే తమ రాష్ట్రానికి దక్కాల్సిన వాటా మేరకు నీటిని వాడుకొనేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని తెలంగాణ (telangana govt) చెబుతుంది. మరో వైపు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ ఇరిగేషన్ ప్రాజెక్టును (rayalaseema lift irrigation project) తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.