Asianet News TeluguAsianet News Telugu

ప్రమాదానికి గురైన వరంగల్ కమీషనర్... సిపి వాహనాన్ని ఢీ కొట్టిన లారీ

వరంగల్ పోలీస్ కమీషనర్ విశ్వనాథ్ రవీందర్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం మెదక్ జిల్లా తుప్రాన్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదం నుండి కమీషనర్ సురక్షితంగా బైటపడ్డారు. అయితే ఆయన బందువొకరు ఈ ప్రమాదంలో మృతిచెందారు.
 

Narrow escape for Warangal commissioner of police
Author
Warangal, First Published Aug 31, 2018, 12:59 PM IST

వరంగల్ పోలీస్ కమీషనర్ విశ్వనాథ్ రవీందర్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం మెదక్ జిల్లా తుప్రాన్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదం నుండి కమీషనర్ సురక్షితంగా బైటపడ్డారు. అయితే ఆయన బందువొకరు ఈ ప్రమాదంలో మృతిచెందారు.

వివరాల్లోకి వెళితే...వరంగల్ సిపి విశ్వనాథ్ వ్యక్తిగత పనిపై వెళుతుండగా మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ ఢీ కొట్టింది. టోల్ ప్లాజా వద్ద ఆగివున్న సిపి కారుతో పాటు ఆయన బంధువుల కారును కూడా లారీ ఢీకొట్టి టోల్ ప్లాజాలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదం నుండి సిపి సురక్షితంగా బైటపడ్డా ఆయన బంధువైన అనిత అనే మహిళ మృతిచెందారు. అలాగే టోల్ ప్లాజా సిబ్బంది అమిత్ కుమార్ శర్మ, గోవింద్, జయకుమార్ లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios