నల్గొండ జిల్లాలోని కేతేపల్లిలో బాలిక అనుమానాస్పదస్థితిలో పవన్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  బాలిక హత్యకు గురైందని చెప్పినా కూడ ఎస్ఐ పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో అతడిని వీఆర్ కు పంపారు.

నల్గొండ: ఈ నెల 13వ తేదీన అనుమానాస్పదస్థితిలో మరణించిన బాలిక ప్రీతిని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ ఆడియో సంభాషణను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.నల్గొండ జిల్లాలోని కేతేపల్లికి చెందిన బాలిక ప్రీతి ఈ నెల 13వ తేదీన అనుమానాస్పదస్థితిలో మరణించింది. బాలికను హత్య చేశారని చెప్పినా కూడ స్థానిక ఎస్ఐ పట్టించుకోలేదు.ఈ విషయమై బాధిత కుటుంబంతో పాటు ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో ఎస్ఐను వీఆర్‌కు పంపారు పోలీసు ఉన్నతాధికారులు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నెల 17వ తేదీన బాలిక డెడ్‌బాడీని వెలికి తీసి రీ పోస్టు మార్టం చేశారు. రీ పోస్టుమార్టంలో కూడ బాలికది హత్యేనని తేలింది. బాలికను కొడుతూ చంపేస్తానని నిందితుడు పవన్ తన ఫ్రెండ్స్ కు చెప్పాడు. ఈ ఆడియో సంభాషణ ఒకటి పోలీసులు గుర్తించారు.ఈ కేసు విచారణను డీటీసీ ఎస్పీ సతీష్ కు అప్పగించారు డీఐజీ రంగనాథ్. నిందితుడు పవన్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.