కేసిఆర్ ఫ్లెక్సీ కి నల్లగొండ రైతులు ఏం చేశారంటే ? (వీడియో)
- వినూత్నంగా ధన్యవాదాలు తెలిపిన నల్లగొండ రైతులు
నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలోని నల్గొండ మండలం బుద్దారం గ్రామంలో రైతులు వెరైటీగా తెలంగాణ సిఎం కేసిఆర్ కు పాలాభిషేకం చేశారు. కేసిఆర్ కే కాదు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ను కూడా కలిపి పాలవర్షం కురిపించారు.
గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా వ్యవసాయ బడ్జెట్ అని రైతులు చెప్పారు. తమ పంట పొలాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసియార్ రాష్ట్ర అర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ల చిత్రపటాలకు కృతజ్ఞతలు ఇలా తెలిపారు. రైతుల పాలాభిషేకం వీడియో కింద ఉంది చూడండి.