కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ఉద్యమం నుండి ఉన్నదేనని,1980 పీవీ మొదటిసారి హన్మకొండ ఎంపీ గా ఉన్నప్పుడు ఆయనకు ఈ విషయం తెలుసని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ ఇందిరాపార్కు వేదికగా మరోసారి గుర్తు చేశారు. 

కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ఉద్యమం నుండి ఉన్నదేనని,1980 పీవీ మొదటిసారి హన్మకొండ ఎంపీ గా ఉన్నప్పుడు ఆయనకు ఈ విషయం తెలుసని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ ఇందిరాపార్కు వేదికగా మరోసారి గుర్తు చేశారు. 

అప్పటి జనతా ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ తరువాత నేను హన్మకొండ ఎంపీగా ఉన్న సమయంలో లేవనెత్తాను.. అని గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ రాయబరేలిలలో పెట్టినప్పుడు కోచ్ ఫ్యాక్టరి తెలంగాణలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరి ఎప్పటికీ రాదని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరని మండిపడ్డారు. కేంద్రంలో ఎప్పటికీ బీజేపీనే అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలని అన్నారు. 

ఇదిలా ఉండగా ఈ నెల మొదట్లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్నట్లుగా వస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైరయ్యారు. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు.

ఐటీఐఆర్ లాగే ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మంగళం పాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలు మార్లు కేంద్రాన్ని కోరామని మంత్రి స్పష్టం చేశారు.

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదన్నారు కేటీఆర్. రైల్వేలను ప్రైవేట్ పరం చేయడం జాతి వ్యతిరేక చర్యనే అన్నారు మంత్రి. బుల్లుట్ రైలు అంటూ గొప్పులు చెప్తూ.. తెలంగాణకు మొండిచేయి చూపారని ఆయన మండిపడ్డారు. 

ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని, లేఖలు రాసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.

మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని ప్రయత్నాలను తాము చేస్తూనే ఉన్నామని మంత్రి వెల్లడించారు. దీనిలో భాగంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అవసరమైన స్థల సేకరణ కూడా పూర్తయిందని కేటీఆర్ తెలిపారు.

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అత్యంత విలువైన 150 ఎకరాల భూమిని ప్రత్యేక శ్రద్ధతో మరో ప్రభుత్వ శాఖ నుంచి సేకరించి కేంద్ర రైల్వే శాఖకు అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.