సింహం సింగిల్ గానే వస్తదని ప్రకటించిన ఎంపి కవిత

సింహం ఎప్పుడైనా సింహమేనని పేర్కొన్నారు సిఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత. సింహం ఎప్పుడైనా సింగిల్ గానే వస్తదని స్పష్టం చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న పలువురు గిరిజన కార్మికులు ఎంపి కవిత సమక్షంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో చేరారు. ఈ సందర్భంగా కవిత చేసిన కామెంట్స్ ఇవి.

కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నది ఎవరో అందరికి తెలుసు.

100% వారసత్వ కొలువులు ఇచ్చి తీర్తం

AITUC నాయకులను ఎక్కడిక్కడ ఎండగట్టండి, నిలదీయండి.

తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిన ఘనత మాదే

అబద్దాలు, నటన, కుట్రపూరితంగా అదొక రాజకీయ కూటమిగా ఏర్పడ్డది.

సింహం ఎప్పుడూ సింగిల్ గానే ఉంటది

TBGKS సింగిలా గానే గెలుస్తుంది

TBGKS అధికారంలోకి రాగానే కార్మికులకు 0% లోను ద్వారా సొంతింటి కలను నేరవేరుస్తాం

2015, 16, 17 లో appoint అయిన బదిలీ వర్కర్స్ ని permanent చేస్తాం

సింగరేణి లో ఉద్యోగుల తల్లిదండ్రులకు చికిత్స అందేలా చర్యలు తీసుకుంటాం

జాతీయ సంఘాలు ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలబడలేదు

కార్మికులందరికి వర్తించేలా ఇన్సెంటివ్ విధానం

పారమెడికెల్ సిబ్బంది కి కోల్ ఇండియా మాదిరిగా క్యాడర్ స్కీం

అంబేద్కర్ జయంతి ని పబ్లిక్ హాలిడే గా చేస్తాం

ఇల్లందు ఏరియా కి పూర్వ వైభవం తెస్తాం... కార్మికులకు పని కల్పిస్తాం

అన్ని బావుల్లో... అన్ని షిఫ్టులలో... కాంటీన్ లలో నాణ్యమైన ఫుడ్ ఉండేలా యాజమాన్యాలతో మాట్లాడి చేయిస్తాం

కార్మికులు కోరిన కోర్కెలను పరిశీలించి పరిష్కరిస్తాం

5600 కొత్త ఉద్యోగాలను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి లో కల్పించాం

అని కవిత కార్మికులకు తెలిపారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->ఏషియానెట్-తెలుగు క్రైమ్ న్యూస్