దీపావళి పండగపూట హన్మకొండ జిల్లా కాజీపేటలో తల్లీకూతురు అనుమాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. 

హన్మకొండ : దీపావళి పండగపూట ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. ఏదైనా కష్టం వచ్చిందో లేక మరేదైనా జరిగిందోగానీ ఆనందోత్సాహాలతో పండగ జరుపుకోవాల్సిన వేళ తల్లీకూతురు తనువు చాలించారు. ఈ దుర్ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాజీపేట దర్గా ప్రాంతానికి చెందిన కన్నెబోయిన రేణుక, కూతురు నవ్య దీపావళి పండగపూట కనిపించకుండా పోయారు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా ఓ చెరువు ఒడ్డున వీరి వస్తువులు కనిపించాయి. దీంతో స్థానికుల సాయంతో చెరువునీటిలో గాలించగా తల్లీకూతురు మృతదేహాలు లభించాయి. 

దీపావళి పండగపూట తల్లీకూతురు మృతి ఆ కుటుంబంలోనే కాదు కాజీపేటలో విషాదాన్ని నింపింది. ఎంతపని చేసావమ్మా అంటూ మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తల్లీకూతురు మృతివార్త తెలిసి చెరువువద్దకు భారీగా స్థానికులు చేరుకున్నారు. 

Read More సోషల్ మీడియాలో ఇద్దరు బాలికలతో పరిచయం.. మార్ఫింగ్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం..

ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను నీటిలోంచి బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లీకూతురు మృతికి గల కారణాలు తెలియవని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరిది ఆత్మహత్యా? లేక మరేమైనా జరిగిందా అన్నకోణంలో దర్యాప్తు చేపట్టారు.