Asianet News TeluguAsianet News Telugu

ప్రతీ పౌరుడి వెన్నులో వణుకు పుడుతోంది.. సీజేఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

గుజ‌రాత్ అల్ల‌ర్ల నేప‌థ్యంలో జ‌రిగిన‌ బిలిస్‌బానో లైంగికదాడి కేసులో శిక్షను అనుభ‌విస్తున్న‌ 11 మంది దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసిన విష‌యంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని, విడుద‌ల ఆర్డ‌ర్ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేశారు. 

MLC Kavitha's letter to CJI
Author
Hyderabad, First Published Aug 20, 2022, 6:19 AM IST

గుజ‌రాత్ అల్ల‌ర్ల నేప‌థ్యంలో జ‌రిగిన‌ బిల్కిస్ బానో అత్యాచార, హ‌త్య‌ కేసులో శిక్ష అనుభ‌విస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విష‌యం తెలిసిందే.. అయితే.. ఈ వ్య‌వహారం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న రేపుతోంది. ఓ నిండు గ‌ర్భీణిపై సామూహిక అత్యాచారం, బాధితురాలి కుటుంబ స‌భ్యుల‌ను హ‌త్య చేసిన నిందితుల‌ను విడుద‌ల చేయ‌డ‌మేమిట‌ని విమ‌ర్శిస్తున్నారు. 

ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ వ్యవ‌హ‌రంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్సీ  కవిత లేఖ రాశారు. 
బిల్కిస్ బానో అత్యాచారం, హ‌త్య‌ కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేసిన విషయంలో జోక్యం చేసుకోవాల‌ని జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. ఈ మేరకు బాధతప్త హృదయంతో లేఖ రాస్తున్నానని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆధారంగా.. వారిని విడుద‌ల‌పై అనర్హత విధించాలని కోరారు.  

స్వాతంత్య్ర దినోత్సవంనాడు శిక్ష పడిన రేపిస్టులు బయటికి రావడంతో ప్రతీ పౌరుడి వెన్నులో వణుకు పుడుతున్నదని సీజేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసిందని, సీబీఐ ప్రత్యేక కోర్టు వారికి శిక్ష విధించిందని అన్నారు.  సీబీఐ దర్యాప్తు చేసిన కేసుల్లో దోషుల శిక్ష తగ్గించే అధికారం గానీ, విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేదని, ఈ వ్య‌వ‌హ‌రంలో కేంద్ర ప్రభుత్వాన్ని  సంప్రదించాలని సీఆర్పీసీ సెక్షన్‌ 435(1)(ఏ) ఈ విషయాన్ని స్ప‌ష్టంగా వివ‌రిస్తుందని తెలిపారు. ఈ కేసులో దోషుల విడుదలకు కేంద్ర ప్రభుత్వంతో గుజరాత్ రాష్ట్ర‌ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందో లేదో స్పష్టత లేదని అన్నారు.  
 
ఈ అత్యంత దారుణమైన ఘ‌ట‌న‌ జరిగినప్పుడు బిలిస్‌ బానో వయస్సు 21 యేండ్లు. అప్పుడు ఆమె ఐదు నెలల గర్భిణీ. గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రత్యేక చోర‌వ‌తో బ‌య‌ట‌కు వ‌చ్చిన రేపిస్టులకు పూలదండలు వేసి స్వాగతం చెప్పడాన్ని చూసి బాధితురాలు బానో మనసు ముకలై ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని..అత్యాచార‌ దోషుల విడుదల నిర్ణయాన్ని వెనకి తీసుకొనేకోవాలనీ, చట్టాలపై విశ్వాసాన్ని, మానవత్వాన్ని కాపాడాలని సుప్రీంకోర్టుకు అభ్యర్థిస్తున్నాను’ అని ఎమ్మెల్సీ కవిత సీజేకు విజ్ఞప్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios