ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో.. ఆమె ఇప్పటికే లీగల్ టీమ్తో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ప్రస్తుతం తెలంగాణ అడిషనల్ ఏజీ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు కవితకు మద్దతుగా ఇప్పటికే ఢిల్లీకి చేరకున్నారు. ప్రస్తుతం కవిత ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో బస చేస్తుండగా.. అక్కడికి భారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక, ఈడీ కార్యాలయానికి బయలుదేరే ముందు కవిత.. బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడే అవకాశం ఉంది.
మరోవైపు ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద కూడా భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈడీ ఆఫీసు వద్దకు చేరుకోకుండా భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని కవితకు ఈడీ సమన్లు జారీచేసింది. మహిళ రిజర్వేషన్లపై ఢిల్లీలో దీక్ష, ఇతర ముందస్తు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో 9వ తేదీన విచారణకు రాలేనని కవిత ఈడీకి తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈరోజు(మార్చి 11)న విచారణకు హాజరయ్యేందుకు సిద్దమయ్యారు. ఇక, ఈరోజు విచారణ సందర్భంగా అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ నోటీసులు రాజకీయ కుట్రగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కూతురు కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కామెంట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో సీబీఐ అధికారులు కవితను సాక్షిగా విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే చార్జ్షీట్లలో కవిత పేరును పలు సందర్భాల్లో ప్రస్తావించిన ఎన్ఫోర్స్మెంట్ కోర్టు.. తాజాగా ఈ కేసులో అరెస్ట్ చేసిన అరుణ్ రామచంద్ర పిళ్లై న్యాయస్థానంలో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టులో కీలక అభియోగాలు మోపింది. కవిత బినామీనని పిళ్లై ఒప్పుకున్నట్లు ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. దీని ఆధారంగా కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రుని ఇండోస్పిరిట్ గ్రూప్లో పిళ్లై కూడా భాగస్వామిగా ఉన్నారని.. ఎల్ 1 లైసెన్స్ ఉన్న ఇండోస్పిరిట్లో పిళ్లైకి 32.5 శాతం వాటా ఉండగా, ప్రేమ్ రాహుల్కు కూడా 32.5 శాతం వాటా ఉందని ఈడీ తెలిపింది.ప్రేమ్ రాహుల్, అరుణ్ రామచంద్ర పిళ్లైలు.. కవిత, ఏపీ వైఎస్ఆర్సీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిలకు బినామీలుగా ప్రాతినిధ్యం వహించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది. భాగస్వామ్య సంస్థలో కవిత వ్యాపార ప్రయోజనాలకు పిళ్లై ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ పేర్కొంది.
మరోవైపు మనీస్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ మరోసారి కవిత పేరును ప్రస్తావించింది. సౌత్ లాబీపై పలు విషయాలను పేర్కొంది. సౌత్ గ్రూప్లో రామచంద్ర పిళ్లై, సమీర్ మహేంద్రు , మాగుంట శ్రీనివాసులు రెడ్డికి 65 శాతం వాటా వుందని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ మొత్తం 9 జోనులను కైవసం చేసుకుందని.. ఢిల్లీ లిక్కర్ స్కాం హైదరాబాద్లోనే జరిగిందని ఈడీ పేర్కొంది. ఐటీసీ కోహినూర్ హోటల్లో కుట్ర జరిగిందని ఈడీ ప్రస్తావించింది.
ఇండో స్పిరిట్లో పెట్టుబడులపై రామచంద్రపిళ్లై స్టేట్ మెంట్ ఇచ్చాడని.. ఇండో స్పిరిట్లో బినామీ పెట్టుబడులు వున్నట్లుగా పేర్కొన్నారని ఈడీ వెల్లడించింది. సౌత్ గ్రూప్కు సంబంధించిన లాబీని బుచ్చిబాబు చూస్తున్నాడని పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి రూ100 కోట్లకు పైగా ముడుపులు వెళ్లాయని.. వైసీపీ ఎంపీ మాగుంటతో కలిసి సౌత్ గ్రూప్ ఏర్పాటు చేశారని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ వ్యవహారంలో ఆప్ నేత విజయ్ నాయర్ది కీలకపాత్రని వెల్లడించింది. సౌత్ గ్రూప్ లాబీపై పలు విషయాలను ప్రస్తావించింది ఈడీ. సౌత్ గ్రూప్ మొత్తం 9 జోన్లను కైవసం చేసుకుందని.. గోరంట్ల బుచ్చిబాబు హవాలా రూపంలో డబ్బులు ఢిల్లీకి తరలించారని వెల్లడించింది.
కవితకు 33 శాతం వాటా ఇస్తామని వీరు చాటింగ్ చేసుకున్నారని ఈడీ తెలిపింది. వీ పేరుతో విజయ్ నాయర్, మేడమ్ పేరుతో కవిత వ్యవహరించారని పేర్కొంది. Samee పేరుతో సమీర్ చాటింగ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పేర్కొంది.
