Asianet News TeluguAsianet News Telugu

సింగరేణిలో కరోనా కట్టడికి చర్యలు... అన్నీతానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కవిత

సింగరేణిలో కోవిడ్ కట్టడికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సింగరేణి యాజమాన్యంతో, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు

mlc kalvakuntla kavitha showing special initiative for singareni employees ksp
Author
hyderabad, First Published May 15, 2021, 4:42 PM IST

సింగరేణిలో కోవిడ్ కట్టడికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సింగరేణి యాజమాన్యంతో, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు.

కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు, క్వారంటైన్‌ సెంటర్‌ల ఏర్పాటు, ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వరకు అన్ని దశల్లో టీబీజీకేఎస్ కృషి చేస్తోంది. సింగరేణి సీఎండీ శ్రీధర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ .. మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 


సింగరేణిలో కోవిడ్ కట్టడికి తీసుకున్న చర్యలు:

* రూ.3.16 కోట్లతో లక్ష పదివేల రాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు, భారీ ఎత్తున పరీక్షలు, 25 వేల మందికి వ్యాక్సినేషన్, 1,400 బెడ్ లతో ప్రత్యేక వార్డుల ఏర్పాటు

* సింగరేణి వ్యాప్తంగా ఉన్న కరోనా ప్రత్యేక వార్డుల్లోనూ, ఐసోలేషన్ సెంటర్లలో అందిస్తున్న వైద్య సేవలతో 9,650 మంది పూర్తిగా కోలుకున్నారు.

* సింగరేణిలో మొత్తం కార్మికుల సంఖ్య 44వేలు కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసులుగా ఉండగా.. 560 మంది చికిత్స పొందుతున్నారు.

*ప్రభుత్వ సహాకారంతో సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే 27 వేల మందికి వాక్సినేషన్ కూడా పూర్తి చేసింది. మరో 50 వేల మందికి వాక్సినేషన్ చేయించడం కోసం వాటిని తయారీదారుల నుండే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

* కరోనా తీవ్రంగా ఉన్న వారిలో ఇప్పటి వరకు 862 మందికి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్య సేవలకు గాను, సింగరేణి యాజమాన్యం సుమారు 38 కోట్ల రూపాయలను వెచ్చించింది.

* సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 673 బెడ్‌లకు అదనంగా, రూ.43 లక్షలతో మరో 755 బెడ్ లను ఏర్పాటు చేశారు.

* 80 లక్షల రూపాయలతో వివిధ రకాలమందులు, ఆక్సిజన్ మీటర్ వంటి 18 రకాల వస్తువులు గల కిట్లను కొనుగోలు చేసి హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి అందజేశారు.

* సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు అవసరమైన రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఫెవిపెరావిర్ వంటి మందులను 5.55 కోట్లలతో సమకూర్చారు.

 * ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు గాను 3.60 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు, 1.18 కోట్ల రూపాయలతో 370 ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేశారు.

* కొవిడ్ వార్డులకు అవసరమైన 20 మంది అదనపు డాక్టర్లను, 250 మంది సిబ్బందిని కూడా కాంట్రాక్టు పద్ధతిన నియమించారు.

*కోవిడ్ పేషెంట్లకు సింగరేణి సంస్థ పౌష్టిక ఆహారం అందిస్తోంది. ఇందుకోసం 1.50 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు వెచ్చించింది. వీటితో పాటు శానిటేషన్ లిక్విడ్, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, వైద్యులకు కావలసిన పీపీఇ కిట్లు, మాస్కులు వంటివి అందజేసింది.

* కోవిడ్‌తో మృతి చెందిన 39 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను కూడా సింగరేణి చెల్లించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios