నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల విమర్శలు గుప్పించారు. బుధవారం కవిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీగా గెలిచిన అరవింద్ మూడేళ్లలో ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల విమర్శలు గుప్పించారు. బుధవారం కవిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీగా గెలిచిన అరవింద్ మూడేళ్లలో ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అరవింద్ గెలిచారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలిపించిన వ్యక్తికి పనిచేసే అవకాశం ఇవ్వాలని అన్నారు. అందుకే తాను ఇన్ని రోజులు అరవింద్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెప్పారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా ఆయన ప్రజలకు ఏం చేసింది లేదని.. అందుకే జిల్లా ప్రజలకు వాస్తవాలు వెల్లడించడానికి మాట్లాడుతున్నట్టుగా తెలిపారు.
తాను 2014 మే నెలలో ఎంపీగా ఎన్నికైన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పసుపు బోర్డు కోసం అనేక ప్రయత్నాలు చేశానని చెప్పారు. 2014లోనే పసుపు బోర్డుపై అప్పటి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశానని చెప్పారు. బాబా రామ్దేవ్ను కలిసి పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని కోరినట్టుగా చెప్పారు. పసుపు బోర్డు కోసం 2016లో ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. 2018లో అ కేంద్ర మంత్రిని మరోసారి కలిశానని తెలిపారు. 2017లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందని చెప్పారు. 2017లోనే డివిజన్ ఆఫీస్ ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో 250 బ్రాయిలర్లను పసుపు రైతులకు అందించిందని చెప్పారు.
మూడేళ్లలో ఎంపీ అరవింద్ పార్లమెంట్లో ఐదుసార్లు మాట్లాడరని.. అప్పుడు పసుపు బోర్డు గురించి ప్రస్తావనే లేదన్నారు. పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని కూడా కోరలేదన్నారు. ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అరవింద్ పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. స్పైస్ బోర్డుకు రూ. 1.92 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. అది కూడా ఓ అపార్ట్మెంట్లో పెట్టారని ఫొటోలు చూపించారు.
అరవింద్ ఎన్ని రోజులు అబద్దాలు ఆడుతారని ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో అరవింద్ అనేక అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. అరవింద్ మాట్లాడిన కొన్ని వీడియో క్లిప్లను అక్కడ ప్రదర్శించారు. ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శరించారు. ఢిల్లీలో మోకాళ్ల యాత్ర చేస్తారో.. ఢిల్లీ నాయకుల వద్ద మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకుని వస్తారో.. ఏం చేస్తారో చేయండి అని సూచించారు. పసుపు బోర్డు ఎప్పుడూ తెస్తారో అరవింద్ చెప్పాలని డిమాండ్ చేశారు. బాండ్ పేపర్లో చెప్పినట్టుగా పసుపు బోర్డు తీసుకురావాలన్నారు. ఇకపై ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే విడిచిపెట్టేది లేదని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం చేతులెత్తేసిందని కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో తెలంగాణలో అభివృద్ది సాధించాం అని చెప్పారు. ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు ద్వారా రైతులకు వేల కోట్ల రూపాయలు అందిచిందని చెప్పారు.
