Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో దారుణం...గుట్టల్లోకి తీసుకెళ్లి మైనర్ పై జేసిబి డ్రైవర్ అత్యాచారం

మైనర్ బాలికను మాయమాటలతో నమ్మించిన జేసిబి డ్రైవర్ అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన దారుణం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. 

Minor allegedly raped by jcb driver in karimnagar district
Author
Karimnagar, First Published Jul 1, 2022, 9:51 AM IST

కరీంనగర్ : అమ్మాయిలపై మృగాళ్ల అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇంటా, బయట, ఇళ్లు, బడి, ఆఫీస్ ఎక్కడా అమ్మాయిలకు సరయిన రక్షణ దక్కడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్భయ, దిశ వంటి చట్టాలు, పోలీసులు షీ టీమ్ లు, కఠిన చర్యలు కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలను నియంత్రించలేకపోతున్నారు. నిత్యం ఎక్కడో అక్కడ మహిళలు వేధింపులకు, అత్యాచారానికి గురయ్యారంటూ దారుణ వార్తలు వింటూనే వున్నాం. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అలాంటి దారుణమే వెలుగుచూసింది. 

పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలిలోని వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో ఓ మైనర్ బాలిక తల్లిదండ్రులతో కలిసి వుంటోంది. అయితే ఇదే గ్రామంలో జెసిబి డ్రైవర్ గా పనిచేస్తున్న వరికొప్పుల శేఖర్ ఈ బాలికపై కన్నేసాడు. బాలికకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు పూర్తి నమ్మకం కలిగాక అదునుకోసం ఎదురుచూసాడు. ఈ క్రమంలో ఒంటరిగా కనిపించిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

బాలికను గ్రామ శివారులో నిర్మానుష్యంగా వుండే గుట్టల్లోకి తీసుకెళ్లిన యువకుడు బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించినా పైశాచికంగా వ్యవహరిస్తూ కోరిక తీర్చుకున్నాడు. అనంతరం బాలికను అక్కడే వదిలి పరారయ్యాడు.  

ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాలిక తనపై జరిగిన అఘాయిత్య గురించి తల్లిదండ్రులను తెలిపింది. దీంతో వారు కూతురితో కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అత్యాచారానికి పాల్పడిన శేఖర్ పై పోలీసులు ఫోక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేసారు. 

ఇదిలావుంటే ఇటీవల కామారెడ్డి జిల్లాలో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ నిరుపేద మహిళ పొట్టకూటికోసం పశువుల కాపరిగా మారి ఒంటరిగా అడవిలో వెళ్లగా ఇద్దరు కామాంధులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

 గాంధారి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిరుపేద మహిళ పశువులు మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్ళింది. ఇలా నిత్యం ఒంటరిగా అటవీప్రాంతానికి వెళ్లే మహిళపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు కామాంధులు బస్సి రాజేందర్, బస్సి రెడ్యా కన్నేసారు. ఎలాగయినా ఆమెను అనుభవించాలని నీచపు అలోచనతో వున్న ఇద్దరు అదునుకోసం ఎదురుచూసి గత గురువారం దారుణానికి ఒడిగట్టారు. అయితే మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఏం జరిగిందో తెలియక ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  
 
అత్యంత పాశవికంగా లైంగికదాడికి పాల్పడటంతో మహిళ అపస్మరక స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఇద్దరు దుండగులు ఆమెను అక్కడే వదిలి పరారయ్యారు. గ్రామానికి చెందిన కొందరు వాగు  ఒడ్డున పడివున్న మహిళను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరకుని మహిళను దగ్గర్లోని హాస్పిటల్ కకు తరలించారు. చికిత్స తర్వాత స్పృహలోకి వచ్చిన మహిళ తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.    

Follow Us:
Download App:
  • android
  • ios