హెలికాప్టర్లలో కొంగర కొలాన్ కు బయలు దేరిన మంత్రులు
టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభకు టీఆర్ఎస్ మంత్రులు బయలు దేరారు. సీఎం కేసీఆర్, మంత్రులు సభకు వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి మూడు హెలికాప్టర్లను సిద్దం చేశారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభకు టీఆర్ఎస్ మంత్రులు బయలు దేరారు. సీఎం కేసీఆర్, మంత్రులు సభకు వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి మూడు హెలికాప్టర్లను సిద్దం చేశారు. కేబినేట్ బేటి అనంతరం మంత్రులు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి రెండు హెలికాప్టర్లలో కొంగరకొలాన్ కు బయలు దేరారు. సీఎం కేసీఆర్ కోసం మరో హెలికాప్టర్ ను సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ మరికాసేపట్లో బయలుదేరనున్నారు.